Saturday, April 20, 2024

వికారాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగి పోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా… ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో భూకంపం.. ఎక్కడో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement