Monday, April 15, 2024

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మంగళవారం ఉదయం పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై లారీ నిలిచి ఉండగా కారు ఢీకొట్టింది. ఇదే సమయంలో ప్రమాదానికి గురైన కారు వెనుక వస్తున్న మరో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement