Friday, March 29, 2024

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మారుతీ సుజుకీ ఎర్టిగా కారు పుణె నుంచి ముంబయి వైపు వెళ్తోంది. ముంబ‌యి – పుణె జాతీయ రహదారి రాయ్‌గఢ్‌ జిల్లా కోప్లీ వద్దకు రాగానే కారు మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ముగ్గురు గాయాలపాలయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌నట స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement