Friday, April 19, 2024

Road accident : అనంత‌లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి..

ఆటోలు బోల్తాప‌డి ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న అనంత‌ర‌పురం జిల్లాలో చోటు చేసుకుంది. గుత్తి, కందికాపుల సమీపంలో ఆటోలు బోల్తా ప‌డ్డాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా.. 18 మంది గాయపడ్డారు. కూలి పనులు ముగించుకుని ఆటోలో స్వ‌గ్రామం వెళుతుండ‌గా ఆటో బోల్తా ప‌డింది. ఘ‌ట‌న‌లో లక్ష్మీదేవమ్మ, చెన్నమ్మ మృతిచెందారు. అదేవిధంగా పుట్లూరు మండలం కందికాపుల వద్ద నీటి సరఫరా ఆటో బోల్తాపడి.. డ్రైవర్‌ అజయ్‌ మృతి చెందాడు. వేరువేరుగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. క్ష‌త‌గాత్రులను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement