Wednesday, April 24, 2024

Road Accident: కారు ఢీకొని దంపతుల మృతి

కారు ఢీకొని భార్యాభ‌ర్త‌లు దుర్మ‌ర‌ణం చెందిన ఘ‌ట‌న చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు మండ‌లంలో చోటుచేసుకుంది. మండలంలోని తిమ్మిరెడ్డిపల్లి వద్ద భార్యాభర్తలు కాణిపాక స్వామి దర్శనానికి బస్ స్టాప్‌కు నడిచి వెళుతుండగా.. పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి భార్యాభర్తలను ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం మృత‌దేహాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులు తిమ్మిరెడ్డిపల్లికి చెందిన చెంగల్ రెడ్డి, కస్తూరిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement