Friday, March 29, 2024

కోలుకుంటోన్న రిష‌బ్ పంత్.. వెల్ల‌డించిన డాక్ట‌ర్స్

రోడ్డు ప్ర‌మాదం నుండి కోలుకుంటున్నాడు టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్. ప్రస్తుతం అతడు ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్‌ ఆరోగ్యంపై అభిమానులకు శుభవార్త అందింది. పంత్‌ ఈ వారంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మోకాలికి జరిగిన సర్జరీ సక్సెస్‌ అయ్యిందని.. పంత్‌ త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. పంత్‌ ఆరోగ్యం మెరుగుపడుతోంది. వైద్య బృందం నుంచి ఈ శుభ వార్త అందింది. మొదటి సర్జరీ విజయవంతమైంది. ఈ వారంలోనే అతడు డిశ్చార్జ్ కానున్నాడు. ఆసుపత్రి వైద్యులతో బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మార్చి నెలలో మరో సర్జరీ అవసరం కావొచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. పంత్‌ తిరిగి మైదనంలోకి రావడానికి కనీసం 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ప్రస్తుతం మా దృష్టంతా అతడి రికవరీపైనే ఉంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement