Friday, March 29, 2024

పంట కొనుగోళ్లు, వ్యాక్సినేష‌న్ పై మంత్రి స‌బితారెడ్డి స‌మీక్ష


పంట కొనుగోళ్లు, వాక్సినేషన్ ప్రక్రియ పై వికారాబాద్ జిల్లా అధికారులతో వర్చువల్ మీట్ ద్వారా రాష్ట్ర‌ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చ‌ర్చించారు. వానాకాలంలో పండిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని ఇటీవల సీఎం కేసీఅర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సబితారెడ్డి వికారాబాద్ జిల్లా కు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరూ కోవిడ్ టీకాలు వేయించుకునేలా చర్యలు తీసుకోవాలని ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగస్వాములు కావాలని మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. ఈ స‌మీక్ష‌కు ఎమ్మెల్యేలు, అధికారులు, హాజర‌య్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement