Saturday, April 20, 2024

Spl Story | రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీతో మస్తు​ ఆమ్దానీ.. 15వేల కోట్ల మార్క్​ చేరనున్న రెవెన్యూ!

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెవెన్యూ, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు మస్తు ఆమ్దానీ వస్తోంది. సీఎం కేసీఆర్​ ముందుచూపుతో భూముల విలువల పెంచడం ద్వారా మరింత ఆదాయం వస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇది ప్రస్తుత ఏడాది మూడో క్వార్టర్​లోనే గత ఏడాది కంటే 40శాతం పెరిగిందన్నది వాస్తవం. అయితే.. అధికారులు అంచనా వేసిన 13వేల కోట్ల టార్గెన్​ దాటి.. 15వేల కోట్ల మార్కు వైపు ఆదాయం పరుగులు తీస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగిసే సమయానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల ద్వారా తెలంగాణ ఆదాయం 40 శాతం పెరిగి రూ.9,531 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల కోట్ల అంచనా టార్గెట్​ కాగా.. దానికంటే చాలా ఎక్కువగా రూ.15 వేల కోట్లకు పైగా వసూళ్లు రావచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అధికారులు తెలిపిన ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.12,364 కోట్లు కాగా, ప్రస్తుత సంవత్సరంలో ఇది ఇప్పటికే రూ.9,531 కోట్లు దాటేసింది. ఒక్క డిసెంబరులోనే రెవెన్యూ వసూళ్లు రూ.1,100 కోట్లు దాటాయి. ఇక.. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న వేగాన్ని బట్టి మార్చి చివరి నాటికి రూ.15,000 కోట్లను సులభంగా దాటవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14.54 లక్షల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 5.63 లక్షలు (39 శాతం) వ్యవసాయ ఆస్తులు కాగా, 8.91 లక్షలు (61 శాతం) వ్యవసాయేతర ఆస్తులు. ఒక్క డిసెంబర్‌లోనే అత్యధికంగా 1.09 లక్షల వ్యవసాయేతర ఆస్తులు నమోదయ్యాయి.

డిసెంబర్ 31 వరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.7,944 కోట్లు, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.1,587 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ 9.5 లక్షలు దాటి.. ఆదాయం రూ. జనవరి 21 నాటికి 8,473 కోట్లుకు చేరింది. అన్ని రకాల ఆస్తుల విక్రయాలు, కొనుగోలులో సాధారణ పెరుగుదల.. ఆస్తుల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం వల్ల ఆదాయంలో పెరుగుదల జరిగిందని అధికారులు అంటున్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం భూముల విలువలను పెంచింది. అయితే భూముల విలువలను పెంచిన తర్వాత కూడా శాఖకు ప్రతి నెల సగటున రూ.1,000 కోట్ల ఆదాయం వస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట్.. ఖాజాగూడ రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుండి ఆదాయంలో ఎక్కువ భాగం వస్తున్నట్టు లెక్కలను పరిశీలిస్తే తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement