Saturday, April 20, 2024

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు : ములుగు జిల్లాలోని వేంకటాపూర్ మండలం రామప్ప దేవాలయంలో హత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రామలింగేశ్వర స్వామిని ములుగు ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ ఉప అధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రవళి రెడ్డితో కలిసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ పూజారులు సాంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలు సన్నాయిలతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి రామలింగేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ గైడ్స్ రేవంత్ రెడ్డికి ఆలయ ప్రాముఖ్యతను వివరించారు. అలాగే పక్కనే ఉన్న విద్యార్థులతో కాసేపు రేవంత్ రెడ్డి ముచ్చటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement