Friday, April 19, 2024

టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్‌తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి లేపుతున్నాయి. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనను కలిశారు. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీకి అంటీముట్టనట్లుగా డీఎస్ వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీ వైఖరిపై కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన కొడుకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంటే.. మరో కుమారుడు అరవింద్ బీజేపీ పార్టీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. కాగా గత వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

పార్టీకి దూరంగా ఉంటున్న, పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేతలను మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం కూడా డీఎస్‌ను కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేందుకే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి జిల్లాల వారీగా పలువురు నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుని పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement