Friday, April 19, 2024

కొండాతో రేవంత్‌రెడ్డి సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో సమావేశమయ్యారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు రేవంత్ భేటీతో ఆయన మళ్లీ హస్తం పార్టీలోకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ వార్త కూడా చదవండి: రేవంత్ మాస్టర్ స్కెచ్.. వలసలు షురూ

Advertisement

తాజా వార్తలు

Advertisement