Thursday, April 25, 2024

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చాంద్ బాషా.. క‌న్నుమూత‌

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చాంద్ బాషా క‌న్నుమూశారు.ఆయ‌న వ‌య‌సు 92సంవ‌త్స‌రాలు. ఆయన ప్రముఖ రచయిత చంద్రబోస్‌ భార్య సుచిత్రకు తండ్రి.చాంద్‌బాషా తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాలకు కూడా సంగీతం అందించాడు. చాంద్‌ బాషాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వీళ్లలో కొరియోగ్రాఫర్‌ సుచిత్ర ఒకరు. ఈమె ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. కాగా చాంద్‌ బాషా అంత్యక్రియలు జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో నేడు జరుగనున్నాయి. చాంద్‌ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీతం అందించాడు. తెలుగులో ‘ఖడ్గ తిక్కన్న’, ‘బంగారు సంకెళ్లు’, ‘స్నేహమేరా జీవితం’, ‘మానవుడే దేవుడు’ వంటి సినిమాలకు సంగీతం అందించాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement