Wednesday, April 24, 2024

Reliance Jio: జియో మరో సంచలనం.. ప్రభుత్వానికి రూ.30,791 కోట్ల చెల్లింపు

దేశీయ టెలికాం రంగంలో నెంబర్‌ వన్‌ గా ఉన్న జియో.. ప్రభుత్వానికి భారీ బకాయిలు చెల్లించింది. స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు గడువుకు ముందుగానే రూ. 30, 971 కోట్లు చెల్లించింది. 

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో) 2014, 2015, 2016, 2021 సంవత్సరాల వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించిన మొత్తాన్ని చెల్లించింది. అయితే ఎయిర్‌టెల్‌తో కలిసి ఈ స్పెక్ట్రమ్‌ను వాడుకునే హక్కు పొందింది. అయితే వాయిదా వేసిన ఈ చెల్లింపును ముందుగానే చెల్లించింది. వేలం ద్వారా, ట్రేడింగ్ ద్వారా రిలయన్స్ జియో మొత్తం 585.3 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.

రిలయన్స్‌ 2016 సంవత్సరంలో వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు సంబంధించి 2021 అక్టోబర్ నెలలో మొదటి విడత ముందస్తు చెల్లింపును చేసింది. ఆ తర్వాత టెలికామ్ కంపెనీలు బకాయిపడ్డ స్పెక్ట్రమ్ చెల్లింపుల్ని ముందస్తుగా చెల్లించింది. డిసెంబర్ 2021 నెలలో టెలికాం డిపార్ట్‌మెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. టెలికాం కంపెనీలు వాయిదాపడిన స్పెక్ట్రమ్ లియబిలిటీస్ ఏ తేదీలోనైనా ముందస్తుగా చెల్లించే సౌలభ్యాన్ని అందించాయి. రిలయన్స్ ఇప్పుడు జనవరి 2022 నెలలో ముందస్తు చెల్లింపు చేసింది, అయితే 2014 సంవత్సరంలో వేలంలో పొందిన మొత్తం అలాగే 2015 ట్రేడింగ్ ద్వారా పొందిన స్పెక్ట్రమ్ వాయిదా పడింది.

ఇక, 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2034-35 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించింది. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధితో 9.30 శాతం నుండి 10 శాతం మధ్య వడ్డీ రేటును కలిగి ఉంది. ముందస్తు చెల్లింపుల వల్ల ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సంవత్సరానికి రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా అవుతుందని సంస్థ అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement