Sunday, March 24, 2024

పీజీ మెడికల్‌ ప్రవేశాలకు నీట్‌ అర్హత మార్కుల తగ్గింపు.. 27 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: పీజీ మెడికల్‌ నీట్‌ కటాఫ్‌ స్కోర్‌ తగ్గడంతో అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వి జ్ఞాన విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం శనివారం పీజీ మెడికల్‌ కన్వీనర్‌ అదేవిధంగా యాజమాన్య కోటా సీట్ల దరఖాస్తుకు మరో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నీట్‌-2022 పీజీ అర్హత కటాఫ్‌ స్కోరును 25 పర్సంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనరల్‌ అభ్యర్థులు 25 పర్సెంటైల్‌ 201 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీకి 15 పర్సెంటైల్‌ 186 మార్కులు, దివ్యాంగులకు 20 పర్సంటైల్‌ 169 మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హత సాధించారు.

కటాఫ్‌ మార్కులు తగ్గించడంతో అర్హత పొందిన విద్యార్థులు కన్వీనర్‌ కోటా, సీట్లకు ఈనెల 23వ తేది ఉదయం 8 గంటల నుండి 26వ తేది సాయంత్రం 5 గంటల వరకు అదేవిధంగా యాజమాన్య కోటా సీట్లకు ఈనెల 24వ తేది ఉదయం 8 నుండి 27వతేది సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచాాంనికి యూనివర్సిటీ వె బ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ను చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement