Tuesday, March 26, 2024

గ్రూప్ 2 ఉద్యోగాల‌కు రికార్డ్ స్థాయిలో ద‌ర‌ఖాస్తులు…

హైద‌రాబాద్ – గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది…
ప్రభుత్వ విభాగాల్లోని వివిధ 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్ ను డిసెంబర్‌ 29, 2022న నెంబర్‌ 28/2022 విడుదల చేసింది… జనవరి 18 నుంచి గురువారం (ఈనెల 16న) సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది… ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు… కాగా, ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకోవటం గమనార్హం…

Advertisement

తాజా వార్తలు

Advertisement