Saturday, March 23, 2024

RCB జట్టులో మరో ఆటగాడికి కరోనా పాజిటివ్

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఆందోళనకు గురవుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ జట్టుకు సంబంధించి ఓపెనర్ దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడగా తాజాగా మరో ఆటగాడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆర్సీబీ ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా బారిన పడినట్లు ఆర్సీబీ స్వయంగా ప్రకటించింది. ‘రెండోసారి చేసిన టెస్టులో డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు’ అని ఆర్సీబీ తెలిపింది. కాగా అటు ఇప్పటికే ఢిల్లీ జట్టులో అక్షర్ పటేల్‌, ముంబై జట్టులో సహాయక సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement