Tuesday, April 23, 2024

రవితేజ ‘కిలాడీ’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ

మాస్ మహారాజ్ రవితేజ ‘కిలాడీ’ సినిమాపై సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా రూమర్లు నడుస్తున్నాయి. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. దీంతో చిత్ర యూనిట్ స్పందించింది. ఈ సినిమా తొలుత థియేటర్లలోనే విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని వివరించింది.

కాగా ‘కిలాడీ’ స్ట్రీమింగ్ రైట్స్ హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ రూ.6 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెలలోనే విడుదల కావాల్సింది. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మళ్లీ తెరచుకుంటే.. ముందుకొచ్చే సినిమాల్లో ఖిలాడి ముందు వరుసలో ఉండనుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి రమేష్ వర్మ దర్శకుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement