Tuesday, March 26, 2024

బాలివుడ్‌లో చాన్స్ కొట్టేసిన ర‌ష్మిక‌.. ర‌ణ్‌బీర్‌కు జంట‌గా కొత్త సినిమా

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటించనుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘యానిమల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ చాక్లెట్ బోయ్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో రష్మిక కథానాయికగా చాన్స్ కొట్టేసింది. ‘యానిమల్’ సినిమాను టీ – సిరీస్ రూపొందిస్తుండ‌గా… ఉగాదిని పురస్కరించుకుని ఆ సంస్థ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఉగాది సందర్భంగా ‘యానిమల్’ బృందంలోకి రష్మిక మందన్నకు స్వాగతం. ఈ ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని టీ-సిరీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ‘యానిమల్’ ప్రపంచంలోకి రష్మిక మందన్నకు సుస్వాగతం. ఈ చిత్రంలో గీతాంజలి అనే పాత్రలో ఆమె కనిపించనుంది’’ అని సందీప్‌రెడ్డి తెలియ‌జేశాడు. ‘యానిమల్’ లో తొలుత పరిణీతి చోప్రా కథానాయికగా ఎంపికయ్యింది. కానీ, ఇంతియాజ్ అలీ చిత్రంలో అవకాశం రావడంతో ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement