Wednesday, April 24, 2024

రంగ రంగ‌వైభ‌వంగా ప్రీరిలీజ్ ఈవెంట్ -గెస్ట్ లుగా సాయిధ‌ర‌మ్ తేజ్..వ‌రుణ్ తేజ్

హీరోగా వైష్ణ‌వ్ తేజ్ రంగ రంగ వైభ‌వంగా మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల కానుంది. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కేతికశ‌ర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ప్ర‌స్తుతం చిత్ర‌బృందం వ‌రుస ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో సాయంత్ర 5 గంట‌ల‌కు జ‌రగనుంది. ఈ క్రమంలో చిత్ర బృందం గెస్ట్‌ల‌ను ప్ర‌క‌టించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్ తేజ్ రానున్నట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మెగా యువ హీరోలు ఒకే వేదిక‌పైకి రానుండ‌టంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement