Saturday, March 23, 2024

నర్సింగ్ కళాశాల ఆకస్మిక తనిఖీ

బాన్సువాడ పట్టణంలోని బీఎస్సి నర్సింగ్ కళాశాలను తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల విద్యార్థులతో సభాపతి మాట్లాడారు. కళాశాలలో సౌకర్యాలు సేవలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య తలెత్తడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. సభాపతి వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడారు. లో వోల్టేజ్ సమస్యను అధిగమించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించే సందర్భంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి నుండి మాతా శిశు ఆసుపత్రులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు సభాపతి సూచించారు. సభాపతి వెంట బాన్సువాడ ఆర్డిఓ రాజా గౌడ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement