Saturday, April 20, 2024

ఆస్పత్రి నుంచి రాష్ట్రపతి డిశ్చార్జ్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల అస్వస్థతకు గురికాగా వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి తాను పూర్తిగా కోలుకున్నట్టు వెల్లడించారు. సోమవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని, రాష్ట్రపతి భవన్‌కు తిరిగొచ్చానని తెలిపారు. తాను సత్వరమే కోలుకోవడానికి కారణమైన ఎయిమ్స్, ఆర్మీ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి, తన ఆరోగ్యం కోసం ప్రార్థించినవారికి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి భవన్‌కు తిరిగొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement