Thursday, March 28, 2024

క్రిస్ మ‌స్ వేడుక‌ల్లో రామ్ చ‌ర‌ణ్..ఉపాస‌న‌ల‌తో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్

ప్ర‌తి సంవ‌త్స‌రం క్రిస్ మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుతుంటారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..ఉపాస‌న‌లు.ఈ సంబ‌రాల‌కి అత్యంత సన్నిహితులను ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ దంపతులు క్రిస్ మస్ వేడుకలను నిర్వహిస్తుండగా, దీనికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోను ఉపాసన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో షేర్ చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు శిరీష్, రామ్ చరణ్ తోబుట్టువులు, నీహారిక తదితరులు ఇందులో ఉన్నారు. రామ్ చరణ్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement