Friday, March 29, 2024

నేడు ఢిల్లీకి రామ్ చరణ్.. ప్రధాని మోడీతో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రముఖ సినీ నటుడు ‘నాటు నాటు’ పాటతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి హస్తినకు చేరుకోనున్న ఆయన, ఓ ఇంగ్లిష్ ఛానెల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్‌లో పాల్గొంటారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్టు తెలిసింది.

- Advertisement -

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత అమెరికా నుంచి తొలిసారిగా భారత్ చేరుకుంటున్న చరణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు, అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. రామ్ చరణ్ సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నట్టు సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement