Thursday, April 18, 2024

మరో సినిమాను లైన్‌లో పెట్టిన హీరో రామ్‌చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే అతడు నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు లెజెండ్ దర్శకుడు శంకర్‌తో కూడా అతడు పనిచేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా 2023లో విడుదల కానుంది.

శంకర్‌తో చేస్తున్న సినిమాతో పాటే జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేసేందుకు చ‌ర‌ణ్ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. సాయిదేవా ప్రొడక్షన్స్ బ్యానరుపై ఎన్వీ ప్ర‌సాద్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానరుపై రామ్‌చ‌ర‌ణ్ సంయుక్తంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. గౌత‌మ్ తిన్ననూరి ప్ర‌స్తుతం హిందీలో ‘జెర్సీ’ సినిమా రీమేక్ చేస్తున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముక్కు అవినాష్..అమ్మాయి ఎవరంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement