Friday, March 29, 2024

రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి : మంత్రి హ‌రీష్ రావు

వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement