Friday, April 19, 2024

రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్ధల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కల్పించినట్టు రాజస్ధాన్‌ ప్రభుత్వం పేర్కంది. గత బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మహిళల‌కు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనుమతిస్తామని రాజస్దాన్‌ సీఎం అశోక్‌ గెెహ్లాట్‌ ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్‌ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

వేతనం ఎంత ఇవ్వలనేది ఆయా డిపార్ట్‌మెంట్‌లు, సంస్ధలు నిర్ణయిస్తాయి. 20 శాతం మంది మ#హళలను నియమించుకున్న సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహకరాం అందచేస్తుంది. ఈ పధకానికి రాజస్ధాన్‌ ప్రభుత్వం రూ 100 కోట్ల కేటాయించింది. ఆరు నెలల్లో 20,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కాగా ఇప్పటివరకూ 150 మంది మహిళలు, 9 కంపెనీలు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అయ్యాయని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement