Thursday, March 28, 2024

భారీ డిస్కౌంట్: రూ.30 కోట్ల హెలికాప్టర్ రూ.4 కోట్లకే

రాజస్థాన్ ప్రభుత్వం ఓ హెలికాప్టర్‌ను అత్యంత చౌకగా అమ్మకానికి పెట్టింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరా రాజే ఉన్నప్పుడు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్ లాండ్ కంపెనీకి చెందిన ట్విన్ ఇంజిన్ 109 హెలికాప్టర్ ను రూ. 30 కోట్లతో కొనుగోలు చేశారు. ఆమె సీఎంగా ఉన్నప్పుడు అధికార కార్యక్రమాలను ఈ హెలికాప్టర్ ను వినియోగించారు. అయితే అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేశారు. అప్పటి నుంచి ఈ హెలికాప్టర్‌ను ఎవరూ వినియోగించలేదు. దీంతో అప్పటి నుంచి అది గోడౌన్ లో వృథాగా పడి ఉంది.

ఈ నేపథ్యంలో ఆ హెలికాప్టర్‌ను అమ్మేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత ఖరీదుతో పాటు అన్ని భద్రత సదుపాయాలు గల హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు 12 సార్లు టెండర్లను పిలిచినా కొనేందుకు ఎవరూ రాలేదు. దీంతో ఏకంగా రూ. 26 కోట్ల డిస్కౌంట్ ఇస్తూ… కేవలం రూ.4 కోట్లకే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈసారైనా ఎవరైనా కొనేందుకు ముందు వస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement