Friday, March 29, 2024

‘బుల్లెట్ బండి’ పై అసెంబ్లీకి వ‌చ్చిన‌ రాజాసింగ్

గోషామ‌హాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ‘ బండి కాదు.. మొండి ఇది సాయం చేయండి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే పలుమార్లు తన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం విషయంలో అభ్యర్థించారు. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే తనకు కొత్త వాహనం కేటాయించడంలేదని.. అందులో భాగంగానే ఇలా నిరసన తెలుపుతున్నట్టు రాజాసింగ్ తెలిపారు. కాగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ప్రగతి భవన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే కారు వదిలేసి వెళ్లడంతో పోలీసులు దానిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement