Thursday, March 28, 2024

ఈ నెల 27 వరకు రాజ్ కుంద్రా కస్టడీ పొడిగింపు

ఫోర్న రాకెట్ కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోలీస్ కస్టడి పొడిగించింది ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు. రాజ్ కుంద్రా కస్టడీ నేటితో ముగియనుండటంతో ఆయనను పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలని ఈ సందర్భంగా కోర్టును పోలీసులు కోరారు. దీంతో, రాజ్ కుంద్రాతో పాటు, అతని సహచరుడు ర్యాన్ థోర్పే పోలీస్ కస్టడీని ఈనెల 27 వరకు కోర్టు పొడిగించింది. ఈ నెల 19న రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్ ద్వారా పోర్న్ కంటెంట్ ను చూపిస్తున్నారనే ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజ్ కుంద్రా నుంచి 4 టీబీ అడల్ట్ కంటెంట్ ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఆశ్లీల చిత్రాల ద్వారా వచ్చిన సంపాదనను రాజ్ కుంద్రా ఆన్ లైన్ బెట్టింగులకు ఉపయోగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఏపీలో ఇద్దరు ఐఏఎస్ లపై అరెస్ట్ వారెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement