Thursday, April 25, 2024

మూడో వన్డేకు వరుణుడు ఆటంకం

భారత్-శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. 23 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 147పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా ఒక్క పరుగు తేడాలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. పృథ్వీ షా 49 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 49 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ధావన్ 13 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న సంజు శాంసన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ (22), మనీష్ పాండే (10) ఉన్నారు.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియాలో ఐదు కొత్త ఆటగాళ్లకు చోటు

Advertisement

తాజా వార్తలు

Advertisement