Thursday, March 28, 2024

దేశ ప్రజలపై పెగాస‌స్ స్పైవేర్‌ను ఎందుకు వాడారు: రాహుల్ గాంధీ..

దేశంలో పెగాసస్ అంశం సెగలు రేపుతోంది. పెగాసస్ పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. పెగాస‌స్ స్పైవేర్‌తో హ్యాకింగ్ జ‌రిగిన అంశంపై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించాల‌ని ఇవాళ ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశారు. పెగాసస్ పై పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు విపక్ష పార్టీ నేతలు. దేశ ప్ర‌జ‌ల‌పై ఎందుకు స్పైవేర్‌ను వాడిన‌ట్లని ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌ను ఆయ‌న ప్రశ్నించారు. పెగాస‌స్ వ్య‌వ‌హారం జాతీయవాదానికి చెందిన‌ద‌ని, రాజ‌ద్రోహం కూడా ఉన్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. ఇది ప్రైవ‌సీకి సంబంధించిన అంశం కాదు అని, ఇది జాతి వ్య‌తిరేక చ‌ర్య అని రాహుల్ అన్నారు.

పెగాస‌స్ వ్య‌వహారం కేవ‌లం ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీకి సంబంధించిన కాదు అని, అది జాతీయ భ‌ద్ర‌త‌కు చెందుతుంద‌ని ఆర్జేడీ నేత మ‌నోజ్ జా, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌లు తెలిపారు. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి ఆ అంశంపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో స‌భ‌లో ఉండాల‌న్నారు. కేంద్ర ఐటీశాఖ మంత్రిని కూడా స్నూపింగ్ చేశార‌ని రౌత్ ఆరోపించారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలూ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాలు చ‌ర్చ‌ల‌ను అడ్డుకుంటున్న‌ట్లు త‌ప్పుడు సందేశాల‌ను ప్ర‌భుత్వం పంపుతోంద‌ని, కానీ దాంట్లో నిజం లేద‌ని, తాము ఎప్ప‌టిక‌ప్పుడు నోటీసులు ఇస్తున్నామ‌ని, కానీ ప్ర‌భుత్వానికి ఈ అంశంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు సుముఖంగా లేద‌న్నారు. ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు బాలు ఆరోపించారు. కేవ‌లం రాజ‌కీయ‌వేత్త‌లు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పైన మాత్ర‌మే కాదు, ప్ర‌తి ఒక్క‌రిపై పెగాస‌స్ ప్ర‌భావం చూపుతోంద‌ని బాలూ తెలిపారు.

ఇది కూడా చదవండి : డాక్టర్ శృతికి మూడోసారి కరోనా పాజిటివ్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement