Tuesday, April 23, 2024

విదేశాలకు రాహుల్‌ గాంధీ.. ఐడియాస్ ఫ‌ర్ ఇండియా స‌దస్సులో ప్ర‌సంగం

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జీవాలా గురువారం మీడియాకు తెలియజేశారు. లండన్‌లో శుక్రవారం జరిగే ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’ సదస్సులో రాహుల్‌ ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలతో దేశ ప్రస్తుత, భవిష్యత్తు పరిణామాలపై ఆయన మాట్లాడుతారని కూడా వివరించారు.

మే 23న కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో జరిగే ‘ఇండియా ఎట్‌ 75: ది ఛాలెంజెస్‌ అండ్‌ వే ఎహెడ్‌ ఫర్‌ ఎహెడ్‌ ఫర్‌ ఏ రెసిలియెంట్‌ మోడర్న్‌ ఇండియా’పై ప్రసంగిస్తారని సుర్జీవాల వివరించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు సల్మాన్‌ ఖుర్షీద్‌, ప్రియాంక్‌ ఖడ్గే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement