Thursday, March 28, 2024

అస్సాంలో యూనివ‌ర్సిటీ స్టూడెంట్‌పై ర్యాగింగ్‌.. త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్యా య‌త్నం!

ర్యాగింగ్ త‌ట్టుకోలే అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యూనివర్సిటీ భవనం రెండో అంతస్తు నుంచి విద్యార్థి ఆనంద్ శర్మ దూకేశాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ర్యాగింగ్‌కి పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాగా, నాలుగు నెలలుగా ఆనంద్‌ని ర్యాగింగ్ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనతో సంబంధమున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement