Thursday, April 18, 2024

కరోనా వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: రఘురామ రాజన్

దేశంలో ప్రస్తుత పరిస్థితికి ‘ముందుచూపు లేకపోవడం’, ‘నాయకత్వలేమి’ కారణమన్నారు ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. దేశంలో కరోనా వైరస్ రెండో దశలో చెలరేగిపోతుండడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతే కారణమని దేశంలో కరోనా వైరస్ రెండో దశలో చెలరేగిపోతుండడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనతే కారణమని రఘురామ రాజన్ ఆరోపించారు. వైరస్‌పై మనం విజయం సాధించేశామని ప్రకటనలు గుప్పించేశారని, కానీ ప్రపంచంలో ఏం జరుగుతోందో గుర్తించి ఉంటే వైరస్ మళ్లీ విజృంభిస్తుందన్న విషయాన్ని గుర్తించగలిగి ఉండేవారని రాజన్ అన్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండడం కూడా వైరస్ వ్యాప్తికి గల కారణాల్లో ఒకటన్నారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే దేశం నేడు ఈ పరిస్థితుల్లో చిక్కుకుని ఉండేది కాదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement