Thursday, April 25, 2024

మిజోరాంలో కూలిన‌ క్వారీ.. బండ‌ల రాళ్ల కింద చిక్కుకున్న15మంది

మిజోరాంలో ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం ఓ క్వారీ కూలిపోయింది. కార్మికులు మ‌ధ్యాహ్న భోజ‌నం చేసి వ‌చ్చిన త‌ర్వాత ప‌నుల్లో ఉండ‌గానే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 12 మంది కూలీల‌తో పాటు హిటాచి డ్రైవ‌ర్లు క్వారీ లోప‌ల చిక్కుకుపోయారు. వాళ్ల‌ను కాపాడేందుకు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. న‌య్‌థియాల్ జిల్లాలోని మౌద‌ర్హ్ అనే గ్రామంలో ఉన్న‌ ఎబిసీఐ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన క్వారీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

- Advertisement -

రాష్ట్ర విప‌త్తు నివార‌ణ బృందాలతో పాటు స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళాలు, అస్సాం రైఫిల్స్ రెస్య్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనేందుకు చుట్టుప‌క్కల గ్రామాల నుంచి వ‌లంటీర్లు త‌ర‌లివ‌చ్చారు. స్టోన్ క్వారీ శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ క్వారీలో రెండున్న‌ర ఏళ్లుగా ప‌నులు జ‌రుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement