Friday, March 29, 2024

భ‌ర్త‌తో గొడ‌వ‌.. నాలుక‌ని కొరికిన భార్య‌.. ఆసుప‌త్రిలో బాధితుడు

భార్య‌భ‌ర్త‌ల‌న్నాక గొడ‌వ‌లు ప‌డ‌టం మామూలే. ఆ గొడ‌వ‌లు శృతి మిచితే అనూహ్య ప‌రిణామాల‌కి దారి తీస్తాయి..కాగా ఓ భార్య భ‌ర్త‌తో గొడ‌వ ప‌డి అత‌డి నాలుక‌ను నోటితో కొరికిపారేసింది. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా వేరేగా ఉంటున్నారు. ఆటో డ్రైవర్ అయిన బాధితుడు రాధాగ్రామ్‌లోని భార్య వద్దకు వెళ్లాడు. అయితే అతడు పిల్లల్ని కలవకుండా భార్య అడ్డుకుంది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ క్రమంలో భార్యను అతడు కోపంగా ఈడ్చిపడేసి దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె అతడి నాలుకను నోటితో పట్టుకుని గట్టిగా కొరికిపడేసింది.

తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. అతడి నాలుక పైభాగం తీవ్రంగా దెబ్బతిందని మెడికల్ యూనివర్సిటీ ప్లాస్టిక్ విభాగం హెడ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి నరాన్ని మూసివేసినట్టు చెప్పారు. శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే నాలుకకు అయిన గాయం త్వరగా మానుతుందని, కాబ్టటి త్వరలోనే అతడు మళ్లీ మాట్లాడగలుగుతాడని పేర్కొన్నారు. అయితే, మాటల్లో స్పష్టత అంతగా ఉండకపోవచ్చన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఠాకూర్ గంజ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. తీవ్రంగా గాయపడిన బాధితుడిని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని ట్రామా సెంటర్‌లో చేర్పించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement