Friday, April 26, 2024

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

ఏపీ సీఎం జగన్‌తో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం విజేత పీవీ సింధు భేటీ అయ్యారు. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి మెడల్ సాధించిన సింధును ఈ సందర్భంగా సీఎం జగన్ అభినందించారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ… సీఎం జగన్‌ తనను అభినందించారని తెలిపింది. ఇంకా మరింతగా రాణించాలని తనను ప్రోత్సహించారని వెల్లడించింది. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొంది.

క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటే మరిన్ని పతకాలు సాధించడానికి అవకాశం ఉందని పీవీ సింధు అభిప్రాయపడింది. త్వరలో ఏపీలో అకాడమీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసింది. కాగా అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను పీవీ సింధు దర్శించుకుంది. ఆమెకు పూర్ణకుంభంతో దుర్గమ్మ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సింధుకు ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందించారు.

ఈ వార్త కూడా చదవండి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

Advertisement

తాజా వార్తలు

Advertisement