Thursday, April 18, 2024

కొండగట్టు దొంగల పట్టివేత? బీదర్‌లో వలపన్ని పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు వలపన్ని పట్టు-కున్నట్టు- సమాచారం. దేవస్థానంలో రెండు రోజుల క్రితం ఆలయం తలుపులు బద్దలు కొట్టి బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్న సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం వేట ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం అందింది.

వారి వద్ద నుండి 60 శాతం చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఇక్కడికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జగిత్యాల పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. కాగా దొంగతనానికి సంబంధించి దేవస్థానం అధికారులు ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకే వారిని సస్పెండ్‌ చేసినట్టు- దేవస్థానం అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement