Saturday, April 20, 2024

భ‌క్తులు లేకుండా పూరీ ర‌థ‌యాత్ర..

పూరీ జగన్నాథుని రథయాత్ర ఇవాళ ప్రారంభకానుంది. క‌రోనా కార‌ణంగా పూరీ జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌ను ఒడిశా ప్ర‌భుత్వం ఈ ఏడాది పూరీకే ప‌రిమితం చేసింది. గ‌తేడాది మాదిరిగానే భ‌క్తులు లేకుండా ర‌థ‌యాత్ర కొన‌సాగ‌నుంది. ర‌థ‌యాత్ర నేప‌థ్యంలో పూరీలోని అన్ని దారుల‌ను మూసివేసి, రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశారు. రేపు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పూరీలో క‌ర్ఫ్యూ విధించారు. పూరీలోకి ఇత‌ర ప్రాంతాల నుంచి భ‌క్తులు రాకుండా ఉండేందుకు క‌ర్ఫ్యూ విధించింది ఒడిశా ప్ర‌భుత్వం. ఇక పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర సంద‌ర్భంగా భ‌క్త జ‌న‌కోటికి రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా ఒడిశాలోని భ‌క్తులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌గ‌న్నాథుడి ఆశీర్వాదంతో.. దేశ ప్ర‌జ‌లంద‌రూ జీవితాంతం ఆనందంతో, ఆయురారోగ్యాల‌తో నిండి ఉండాల‌ని కోరుకుంటున్నానని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: భూమివైపు దూసుకొస్తున్న భారీ సౌర తుఫాను

Advertisement

తాజా వార్తలు

Advertisement