Thursday, April 25, 2024

రక్షణ కల్పించండి… కలెక్టర్, డీసీపీకి గద్దర్ వినతిపత్రం

బాలసాయిబాబా ట్రస్ట్ భూములపై పోరాడుతున్న తనకు రక్షణ కల్పించాలని ప్రజాగాయకుడు గద్దర్ కోరుతున్నారు. బాలసాయి బాబా ట్రస్ట్ భూములను కాపాడాలంటూ అయన జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్యకు వినతిపత్రం అందజేశారు. భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్నందున తనకు శత్రువులు అధికమయ్యారన్నారు. అందుకే రక్షణ కోసం వెస్ట్ జోన్ డీసీపీ సీతారాంకు తన గోడును వెళ్లబోసుకుంటూ వినతిపత్రం అందించారు.

రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామం బాలసాయి బాబా ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. పేదలకు చెందాల్సిన భూములు కొందరు వ్యక్తులు లాక్కున్నారని, వాటిని వెంటనే పేదలకు పంచాలని అయన కోరారు. బాలసాయి బాబా ట్రస్ట్ భూములపై తన పోరాటం ఆగదని, పేదలకు చెందాల్సిన 59 ఎకరాల భూములు పంచిపెట్టేంతవరకు వదిలి పెట్టనని గద్దర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement