Thursday, April 18, 2024

సావిత్రి కూతురిగా గ‌ర్వ‌ప‌డుతూనే ఉంటా.. విజ‌య చాముండేశ్వ‌రి

మ‌హాన‌టి సావిత్రి కూతురిగా గ‌ర్వ‌ప‌డుతూనే ఉంటాన‌ని తెలిపారు విజ‌య చాముండేశ్వ‌రి. మా చిన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని పట్టించుకునే స్థితిలో ఉండేది కాద‌న్నారు. ఏదైనా చెబితే విని బాధపడేది కానీ, తన పద్ధతిని మార్చుకునేది కాదని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.అమ్మను చూసిన తరువాత స్త్రీలు మానసికంగా బలంగా ఉండాలనే విషయం నాకు అర్థమైంది. అలాగే ఎప్పుడూ ఫిట్ నెస్ పై .. ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టాలనే విషయం తెలుసుకున్నాను. అందుకు సంబంధించిన కోర్సులు చేశాను. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నా చుట్టూ ఉన్నవారిని గైడ్ చేస్తూ వెళుతున్నాన‌ని చెప్పారు. తన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియగానే దగ్గరి బంధువుతో నా పెళ్లి జరిపించేసింది. చివరి రోజుల్లో ఆమె మద్యానికి అలవాటు పడినా ఆమె కూతురినని చెప్పుకోవడానికి నేను గర్వపడుతూనే ఉంటాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement