Monday, April 15, 2024

ఏపీలోని ఆ బీచ్.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్

ఏపీలోని ఓ బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇంతకీ అది ఏ బీచ్ అనుకుంటున్నారా? మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ బీచ్ ఇటీవల యువతి, యువకుల రాసలీలలకు అడ్డాగా మారింది. కృష్ణా జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా యువతి, యువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి రాసలీలలు సాగించడం, పక్కనే ఉన్న రిసార్టులకు వెళ్లి ఎంజాయ్ చేయడంతో ఇక్కడకు కుటుంబాలతో వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వ్యభిచారం చేసే మహిళలే ఇక్కడి రిసార్టులకు వచ్చి యువకులతో బేరాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ అంశంపై పక్కా సమాచారంతో బుధవారం నాడు పోలీసులు బీచ్‌లోని రిసార్టులపై దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న 8 జంటలను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గంటకు రూ.వెయ్యి చొప్పున వ్యభిచారానికి రూమ్‌లను అద్దెకు ఇస్తున్న రిసార్టు ఓనర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా పట్టుబడ్డ నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసేవారని పోలీసులు గుర్తించడం కొసమెరుపు.

ఈ వార్త కూడా చదవండి: ఊడిపోయిన పులిచింతల డ్యామ్ గేటు.. పొంచి ఉన్న వరద ముప్పు

Advertisement

తాజా వార్తలు

Advertisement