Saturday, April 20, 2024

డిగ్రీ కాలేజీల్లో పదోన్నతులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ఫిజికల్‌ డైరెక్టర్‌, లెక్చరర్లకు, లైబ్రరీయన్లకు ప్రమోషన్లను కల్పించనున్నారు. ఇంటర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లను కల్పించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈమేరకు కళాశాల విద్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అర్హత ఉన్న వారిని ఆయా పోస్టుల్లో నింపనున్నారు. ఈనెల 31వ తేదీలోపు సంబధిత ధ్రువపత్రాలతో అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. సీనియారిటీ, రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం పదోన్నతులను కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement