Tuesday, April 23, 2024

గుండెపోటుతో క‌న్నుమూసిన‌.. ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా క‌న్న‌డ ద‌ర్శ‌కుడు కిరణ్ గోవి కన్నుమూశారు. 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. తన ఆఫీసులో ఆయన గుండెపోటుకు గురయ్యారు.సడెన్ హార్ట్ ఎటాక్​కు గురైన కిరణ్ గోవీని ఆయన ఆఫీసులోని స్టాఫ్​ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన మరణంతో శాండల్​వుడ్​లో విషాదం నెలకొంది. కిరణ్​ మృతిపై కన్నడ సినీ ప్రముఖులు అందరు సంతాపం తెలియజేశారు ‘సంచారి’, ‘పయన’, ‘పారు వైఫ్​ ఆఫ్​ దేవదాస్’, ‘యారిగే యారింటు’ లాంటి పలు మూవీస్​ను కిరణ్​ గోవి తెరకెక్కించారు. పలు తెలుగు చిత్రాలకూ ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ‘తిరుగుబోతు’ అనే ఫిల్మ్​ను కిరణ్ డైరెక్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement