Tuesday, April 23, 2024

ఐపీఎల్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఖైదీలు

దేశంలో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. అయితే యూపీలో ఓ జైలులోని ఖైదీలకూ ఐపీఎల్ ఫీవర్ పట్టుకోవడం విచిత్రం. ఫరూఖాబాద్‌లోని ఫతేగఢ్ జైలులో టీవీలో ఐపీఎల్ మ్యాచులు చూసే ఏర్పాట్లు చేయాలని ఖైదీలు మూకుమ్మడిగా నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో లక్నోలో అధికారులతో సమావేశంలో ఉన్న జైలు సూపరింటెండెంట్ ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన జైలుకు చేరుకుని ఖైదీలతో చర్చలు జరిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే అంశంపై ఖైదీలు ఎంతకూ బెట్టువీడకపోవడంతో జైలు అధికారులు ఎట్టకేలకు అంగీకరించి ఐపీఎల్ చూసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖైదీలు తమ నిరసన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement