Wednesday, April 24, 2024

11న విశాఖ‌కు ప్ర‌ధాని మోడీ.. స్కెడ్యూల్ ఇదే..!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 11,12వ తేదీల్లో విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో మోడీ విశాఖకు చేరుకుంటారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఆ రోజు రాత్రికి ప్రధాని మోదీ విశాఖలోనే బస చేస్తారు. 11న ఏడు అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ధాని ప్రారంభించ‌నున్నారు. 12న భారీ బ‌హిరంగ స‌భ‌లో మోడీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ సైతం పాలుపంచుకుంటారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు విజ‌య‌సాయి రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement