Thursday, April 25, 2024

వీడియో: రోడ్డు దాటుతున్న 3 వేల కృష్ణ జింకల పరుగులు

గుజరాత్‌లోని ఓ అటవీ ప్రాంతంలో చెంగుచెంగున దూకుతూ రోడ్డు దాటుతున్న అద్భుత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుమారు 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధాని మోదీ తాజాగా ట్వీట్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోలో పెద్దసంఖ్యలో కృష్ణజింకలు రోడ్డు దాటుతున్నాయి.

గుజరాత్ భావ్‌నగర్‌లోరి కృష్ణజింకల జాతీయ పార్కులో చిత్రీకరించిన ఈ వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేసింది. దీంతో అద్భుతమైన ఈ వీడియోను ప్రధాని రీ ట్వీట్ చేసి ‘అద్భుతం’అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియోను మోదీ షేర్ చేసిన కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్ అయింది. ల‌క్ష‌లాది వ్యూస్ వ‌స్తున్నాయి. వేలాది మంది రీట్వీట్లు చేస్తున్నారు. కృష్ణ జింక‌ల‌ను ఇంత‌టి భారీ సంఖ్య‌లో తొలిసారి చూస్తున్నారమ‌ని కామెంట్లు చేస్తున్నారు. కృష్ణ జింక‌ల‌ను ప‌రిర‌క్షిస్తోన్న ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement