Tuesday, April 23, 2024

పెరగనున్న మారుతీ సుజుకీ కార్ల ధరలు.. జనవరి నుంచి అమల్లోకి

దేశీయ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను జనవరి నుంచి పెంచనుంది. ద్రవ్యోల్బణం, నియంత్రణ
ప్రమాణాలను అందుకోవడం వంటి కారణాల వల్ల ధరలు పెంచడం అనివార్యంగా మారిందని కంపెనీ తెలిపింది. వాహన ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీ అన్ని ప్రయాత్నాలు చేసిందని తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అన్ని మోడళ్ల ధరలు పెంచకతప్పడంలేదని పేర్కొంది. ఏ మోడల్‌పై ఎంత పెంచేది త్వరలోనే ప్రకటించనుంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూమ్‌ ధరపై 1.3 శాతం మేర ధరలను మారుతీ సవరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement