Wednesday, April 24, 2024

కుదుట‌ప‌డుతున్న‌ రాష్ట్రపతి ఆరోగ్యం

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆరోగ్యం క్ర‌మంగా కుదుట‌ప‌డుతున్న‌ద‌ని ఎయిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఎయిమ్స్‌లోని ఐసీయూ నుంచి స్పెష‌ల్ రూమ్‌కు త‌ర‌లించారు. అయ‌న‌ ప్ర‌త్యేక వైద్య బృందం రాష్ట్ర‌ప‌తి ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ద‌ని వైద్యులు చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితి బాగానే ఉన్న‌ద‌ని, అయితే కొద్దిరోజులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. ఈ మరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి.

కాగా, ఛాతిలో స్వ‌ల్పంగా నొప్పి రావ‌డంతో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ గత నెల 29న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చేరారు. అన్ని ర‌కాల ప‌‌రీక్ష‌లు నిర్వహించిన వైద్యులు మార్చి 30న బైసాస్ స‌ర్జ‌రీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement