Tuesday, April 23, 2024

Wishes – తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు..

న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణకు తెలంగాణ కేంద్రంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

అలాగే ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ లో తెలుగులో శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు పొందాయని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement